టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ లు ఇద్దరే. వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో కాస్త కథల విషయంలో దూకుడుగా వెళ్ళడమే కాకుండా ప్రతీ విషయంలో ఆమె ఇతర హీరోయిన్ లకు ఆదర్శంగా ఉంటుంది. ఏ కథ పడితే ఆ కథ తో ఆమె సినిమాలు చేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఆమె ఓటీటీ లో అయినా సరే సినిమాను విడుదల చేయడానికి గానూ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆమె చేస్తున్న ఒక సినిమా కూడా ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో దాదాపుగా ఫైనల్ అయింది అని టాక్ వస్తుంది. ఆమెకు ఇప్పటికే సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా చిత్ర యూనిట్ ఇచ్చింది అని సమాచారం. చిత్ర నిర్మాతలు కళ్యాణ్ రామ్ తో పాటుగా రాధాకృష్ణ ఆమెతో మాట్లాడారు అని ఆమె ఈ సినిమాలో ఎన్టీఆర్ కి మరదలిగా నటించే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఆమె రెండు సినిమాల్లో మన తెలుగు లో ఓకే చేసింది. ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. 

 

ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో కూడా మంచి పాత్రలు వచ్చాయి అని సమాచారం. ఆమె అక్కడ కూడా నటించే అవకాశం ఉంది అని ఒక లవ్ స్టోరీ లో ఆమె నటించాలి అని భావిస్తుంది అని దాదాపుగా కథ కూడా ఓకే అయింది అని సమాచారం. మరి నిజమా కాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: