టాలీవుడ్ లో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను దాదాపుగా సినిమాలు చేసే విషయంలో ముందు నుంచి కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటూ ఏ మాత్రం కూడా హడావుడి లేకుండా వ్యవహరిస్తూ ఉంటాడు. ఏ సినిమా చేసినా సరే సినిమాలకు సంబంధించి అతని నుంచి పూర్తి స్థాయిలో న్యాయం ఉంటుంది. ఏ భాష లో సినిమా చేసినా సరే హడావుడి లేకుండా అతను సినిమాలు చేస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను బాలీవుడ్ లో కూడా ఎక్కువగానే సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతను కరోనా కాలంలో స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల గురించి ఒక కథ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. విద్యార్ధులను నానా రకాలుగా వేధిస్తున్న ఒక స్కూల్ ని ఆయన టార్గెట్ గా చేసుకుని సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఆన్లైన్ లో ఏ విధంగా దోచేస్తున్నారు అదే విధంగా విద్యార్ధుల తల్లి తండ్రులు పిల్లాల చదువుల కోసం ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనే విషయం అతను ప్రస్తావించే అవకాశం ఉంది. 

 

ఇక అది అలా ఉంటే ఈ కథ కు సంబంధించి ఆయన పరుచూరి బ్రదర్స్ తో కూడా మాట్లాడారు అని సమాచారం. వారిని కథ రెడీ చెయ్యాలి అని రానా కోరినట్టు టాక్ మరి. ఈ సినిమా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏంటీ అనేది చూడాలి. ఈ సినిమాలో రానా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తండ్రిగా నటించే అవకాశం ఉంది అని తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అతను ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: