టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్ ల సినిమాలు అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పే హీరోయిన్ నయనతార. ఆమె ఏ సినిమా చేసిన సరే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. కథ ఏ విధంగా ఉంటుంది ఆమె పాత్ర ఏంటీ అనే దాని మీద కాస్త ఆసక్తి ఎక్కువగానే ఉంది జనాలకు. ఆమె కూడా అదే విధంగా చాలా వేగంగా కథలను ఓకే చేయడం స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేయడం వంటివి గతంలో ఎక్కువగా చేసింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సొంత భాష తమిళం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. 

 

కేరళ సినిమాలు కూడా ఆమె బాగానే చేస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు మన తెలుగు లో ఒక సినిమాను నిర్మాతగా చేస్తుంది అనే  ప్రచారం జరుగుతుంది. ఆమె ఒక చిన్న సినిమాను నిర్మాతగా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెకు నిర్మాతగా  మరే ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది అని అది ఇప్పుడు ఆమె బయటపెడుతుంది అని త్వరలోనే ఈ ప్రాజెక్టి కి సంబంధించి ఒక కీలక అడుగు పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె తమిళం లో మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. ఈ మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఈ సినిమాలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోలతోనే ఎక్కువగా చేస్తుంది సినిమాలు. మరి ఆమె తెలుగు లో ఆ సినిమా చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: