టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన మెగాస్టార్, తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. 

IHG

ఇక దాని తరువాత మెగాస్టార్ చేస్తున్న సినిమా ఆచార్య. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవాదాయ శాఖలో అవినీతిని బయటపెట్టే ఒక వ్యక్తి, ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్న తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. 

 

ఇప్పటికే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయిందని, మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకడు సుజీత్ సినిమా కథను పక్కాగా రెడీ చేసినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక స్టార్ నటి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. అలానే దీని అనంతరం మరొక స్టార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయనున్నారని, ఆ సినిమా తాలూకు కథ ఇప్పటికే సిద్ధం అయిందని టాక్. మొత్తంగా చూసుకుంటే ఇలా వరుసగా తన నెక్స్ట్ ప్రాజక్ట్స్ పై మెగాస్టార్ మెగా ప్లాన్స్ నిజంగా అదుర్స్ అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: