ప్రస్తుత టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత అక్కినేని తొలిసారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించారు. ఆ సినిమా అనంతరం మహేష్, ఎన్టీఆర్ ల తో దూకుడు, బృదావనం సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న సమంతకు ఆపై టాలీవుడ్ లో బాగా అవకాశాలు వచ్చాయి. 

IHG

అనంతరం రాజమౌళి తీసిన ఈగ, అలానే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా సమంత చాలా సినిమాలతో అద్భుత విజయాలు అందుకుని టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించారు. స్వతహాగా కేరళ కుట్టి అయిన సమంత, మెల్లగా మన తెలుగు భాషని ఎంతో ఇష్టంగా నేర్చుకుని, ఇటీవల తన మొదటి సినిమా హీరో నాగచైతన్యని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కినేని వారి ఇంటి కోడలైన సమంత, పెళ్లి తరువాత మాత్రం ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. 

 

ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె హీరోయిన్ గా నటించిన రంగస్థలం సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకోవడం జరిగింది. అలానే భర్త చైతన్య తో కలిసి నటించిన మజిలీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలుగా వచ్చిన ఓ బేబీ, యూ టర్న్ సినిమాలతో కూడా విజయాలు అందుకున్న సమంత, ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమా చేస్తున్నారు. తొలి సినిమా ఏ మాయచేసావే తో ప్రేక్షకులను తన అందచందాలు, అభినయంతో కట్టిపడేసిన సమంత, ఇప్పటికీ కూడా అదే వన్నె తరగని అందం, నటనతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. హీరోయిన్ గా తన సంపాదనలో కొంత మొత్తాన్ని సామజిక, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న సమంత, ఇటీవల ప్రత్యూష పేరుతో ఒక ఫౌండేషన్ ని కూడా స్థాపించి తనకు వీలైనంతలో పలువురికి సాయమందిస్తున్నారు ....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: