బాలీవుడ్ కుర్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసిన…  ‘ధోనీ’ సినిమాతో దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మంచి గుర్తింపు పొందుకున్నాడు. అటువంటిది మూడు పదుల వయసులో మంచి భవిష్యత్తు ఉన్న టైంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బొంబాయిలో తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకుని చనిపోవడం అందరికీ షాక్ కి గురి చేసింది. సుశాంత్ అసలు ఎందుకు చనిపోయాడు ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

 

అతను ఎందుకు చనిపోయాడో కారణం కూడా చెప్పకుండా మరణించటంతో సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్ లు నెపోటిజం పేరిట కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, మహేష్ భట్ సోనమ్ కపూర్ కరీనా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై స్థాయిలో విమర్శలు చేశారు. అంతా బాగానే ఉన్నా నెటిజన్లు మాత్రం ఈ విషయంలో మిగతా వారిని విడిచి పెట్టి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ని విడిచి పెట్టడం లేదు. కారణం చూస్తే కరణ్ జోహార్ ఓన్ షో 'కాఫీ విత్ కరణ్' లో ప్రతి ఎపిసోడ్ లో సుశాంత్ సింగ్ ని తక్కువ చేస్తూ టార్గెట్ చేస్తూ షో కి వచ్చే సెలబ్రిటీలను ప్రశ్నలు అడిగే వారట.

 

ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియాలో దీన్నే పట్టుకొని కరణ్ జోహార్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో భయంకరంగా కరణ్ జోహార్ ని అందరూ టార్గెట్ చేయటం తో ఇటీవల ఇండస్ట్రీలో తన సన్నిహితుల దగ్గర ఏడ్చాడట. ప్రస్తుతం కరణ్ జోహర్ ఎవరితో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు అని ఫుల్ డిప్రెషన్ తో నిండా మునిగి పోయాడని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: