ఇప్పటి వరకు తన కెరియర్ లో పరాజయం అన్నపదాన్ని చూడని రాజమౌళి అనవసరంగా ఒక పొరపాటు చేస్తున్నాడా అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికికారణం రాజమౌళి త్వరలో తన కొడుకు కార్తికేయ చేత ఒకప్రముఖ ఓటీటీ సంస్థకు ఒక భారీ వెబ్ సిరీస్ ఆలోచనలు చేస్తున్నట్లు వస్తున్నవార్తలు.


వాస్తవానికి రాజమౌళి నిర్మాతగా సెటిల్ అవ్వాలని గతంలో కూడ కొన్ని ప్రయత్నాలు చేసాడు. రాజమౌళి జూనియర్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘యమదొంగ’ మూవీకి రమా రాజమౌళి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈమె సమర్పణలో విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి రాజమౌళి ‘యమదొంగ’ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు.


అయితే ఆసినిమా హిట్ అయినప్పటికీ ఈసినిమాకు సంబంధించి కొందరు చేతివాటం చూపించడంతో రాజమౌళికి ఈసినిమా వల్ల ఆర్ధికంగా కలిసి వచ్చింది లేదు అంటూ అప్పట్లో గాసిప్పులు వినిపించాయి. దీనితో విశ్వామిత్ర క్రియేషన్స్ నిర్మాణసంస్థ మరుగున పడిపోయింది. ఆతర్వాత రాజమౌళి ‘అందాల రాక్షసి’ సినిమాను సాయి కొర్రపాటితో కలిసి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు ఆమూవీ కూడా ఫెయిల్ అయింది.


ఆమధ్య మళ్ళీ రాజమౌళి కార్తికేయను నిర్మాతగా మార్చి ‘ఆకాశవాణి’ అన్న మూవీని మొదలుపెట్టినా కొన్ని అభిప్రాయభేధాలు వల్ల ఆసినిమా ఆగిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి మళ్ళీ తన సొంత నిర్మాణ సంస్థను వెలుగులోకి తీసుకు రావడానికి ఈకరోనా సమయంలో కూడ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు టాక్. ఈమధ్య వెబ్ సిరీస్ లు ఓటీటీ లలో ఒరిజినల్ సినిమాలకు ఆదరణ లభిస్తుండటంతో రాజమౌళిమళ్ళీ ప్రొడక్షన్ హౌస్ లోకి దిగే ఆలోచన చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సమస్యలతో తల పట్టుకుంటున్న రాజమౌళి మళ్ళీ సినిమాల నిర్మాణంలోకి ఎందుకు వస్తున్నాడు అంటూ ఆశ్చర్య పోతున్నారు. దర్శకుడుగా ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరగని జక్కన్నకు నిర్మాతగా కూడ అలాంటి ట్రాక్ రికార్డ్ కావాలి అన్నప్రయత్నాలలో భాగంగా మాత్రమే రాజమౌళి ఈఆలోచనలు చేస్తున్నాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: