ఇరవై నాలుగేళ్ల కన్నడ ముద్దుగుమ్మ రష్మికా మందన్న శాండల్ వుడ్ లో కంటే టాలీవుడ్ లోనే అగ్రతారగా దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించిన రష్మిక క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయిందని చెప్పుకోవచ్చు. ఈ కుటుంబ భరిత చిత్రంతో ఆమె తెలుగు ఇంటి అమ్మాయి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. లిల్లీ పాత్రలో చాలా అందంగా కనిపించిన ఈమె టాలీవుడ్ దర్శక నిర్మాతలను బాగా ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు. అందుకే అనిల్ రావిపూడి తన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక ని మహేష్ బాబు సరసన నటింపజేశాడు.


నిజానికి ఆమె పాత్ర డైలాగులకు ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఐతే తన మధురమైన వాయిస్ కారణంగా తన పాత్ర ప్రేక్షకులను పులకరింప చేస్తుంది. ఈ కన్నడ భామ ముద్దు ముద్దు మాటలతో చెప్పే తెలుగు డైలాగులు చెవులకు ఇంపుకు ఉంటాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కష్టపడి డబ్బింగ్ చెప్పుకున్న రష్మికా మందన్నకి ఫలితం ఊహించిన దానికంటే ఎక్కువగా దక్కిందని పెట్టుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో రష్మిక నటించింది. నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాలో కూడా ఈమె అల్లరి అమ్మాయి పాత్రలో నటించింది. డియర్ కామ్రేడ్ గీత గోవిందం సినిమాలు చూసుకుంటే... హీరో కంటే హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండగా... రష్మికా కి బాగా గుర్తింపు దక్కింది.


కానీ సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు లభించలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలిక. ఏదేమైనా ఈ కన్నడ అమ్మాయి కన్నడ పరిశ్రమలో అరంగేట్రం చేసి ఆ తర్వాత తెలుగు సినిమాలో తెరంగేట్రం చేసి తన అద్భుతమైన నటన ప్రతిభ తో, కష్టపడేతత్వం తో లక్షల మంది తెలుగు అభిమానులకు సంపాదించి నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: