టాలీవుడ్ లో ఒకప్పుడు నాగార్జున సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉండేది. కాని ఇప్పుడు మాత్రం అలా  లేదు. ఆయన సినిమాలను చూసే వారు ఎవరూ కనపడటం లేదు. ఇక ఆయనలో కూడా ఈ విషయంలో కాస్త అసహనం ఉంది అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే వింటున్నాం. ఆయన ఏ సినిమా చేసినా సరే సక్సెస్ మాత్రం దాదాపుగా  రావడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఇక ఆయన ఇటీవల్ నటించిన రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. 

 

గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నాగార్జున సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నా సరే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు వస్తుందా అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. ఇక ఇప్పుడు ఆయన ఒక హిందీ సినిమా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

 

రెండేళ్ల క్రితం అజయ్ దేవ్‌గణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను చేయడానికి నాగార్జున ఆసక్తిగా ఉన్నారు అని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత నాగ్ ఒక సినిమా తమిళం లో చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: