మన తెలుగు లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వస్తున్నా సరే జనాలు చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ప్రధానంగా రామ్ చరణ్ సినిమాల కోసం జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంది అనే చెప్పాలి. ధ్రువ సినిమా తర్వాత అతని సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది వచ్చేసింది. ఇక ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

సినిమా తర్వాత అతను మహేష్ నిర్మాణ సారధ్యం లో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అన్నారు గాని అది ఎంత వరకు నిజం అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే ఇప్పుడు అతను తన అక్క సుష్మిత తో కలిసి ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపుగా టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే స్టార్ హీరోలు చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన అక్కతో చేసే సినిమాను  అదే విధంగా ఉండాలి అని కోరాడు అని ఆమె కూడా అందుకు ఓకే చెప్పారు అని అంటున్నారు. 

 

ఇక కథ విషయంలో ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ తో ఆమె మాట్లాడగా వారు కూడా ఓకే చెప్పారు అని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన కథ ఒకటి రెడీ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి నిజం ఎంత అనేది తెలియాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: