2020కి హాలిడే ప్రకటిస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. ఆవేశపడి ఓపెనింగ్ లు, షూటింగ్ లు అని రిస్క్ చేయడం కంటే కామ్ గా ఇంట్లో ఉండటమే బెటర్ అనుకుంటున్నారు. డైరీ నుంచి 2020ని స్కిప్ చేసి, 2021 కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. కార్డ్ మీదున్న కథలను తర్వాత ఇయర్ కు పోస్ట్ చేస్తున్నారు. 

 

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వరుస సినిమాలు చేయాలనుకున్నాడు. వకీల్ సాబ్ పూర్తవ్వగానే.. క్రిష్, హరీశ్ శంకర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సీన్ మొత్తం మారిపోయింది. షూటింగులకు బ్రేకులు పడ్డాయి. వకీల్ సాబ్ కూడా ఆగిపోయింది. దీంతో క్రిష్, హరీశ్ శంకర్ మూవీస్ ను 2021కి పోస్ట్ పోన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 బిగినింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్ బాబు. సంక్రాంతికి సూపర్ హిట్ అందుకున్న మహేశ్.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మరో మూవీ మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ ఈ లోపే కరోనా లాక్ డౌన్ వచ్చింది. మహేశ్-పరశురామ్ కాంబోలో సెట్ అయిన సర్కార్ వారి పాట సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. కరోనా ప్రభావం తగ్గేవరకు సెట్స్ కు వెళ్లకూడదు అనుకుంటున్నాడు మహేశ్ బాబు. 

 

ప్రభాస్ సాహో తర్వాత స్పీడ్ పెంచాలనుకున్నాడు. బాహుబలితో 5ఏళ్లు సాహోతో రెండేళ్లు గడిపేసిన ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ మూవీ తర్వాత ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేయాలనుకున్నాడు. ఈ ప్లాన్ తోనే రాధాకృష్ణ మూవీ సెట్స్ లో ఉండగా.. నాగ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ఓకే చేశాడు. కానీ ఈ సినిమా సెట్స్ కు వెళ్లడానికి మరో ఏడాది పట్టే అవకాశముంది. 

 

ఈ ఏడాది షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలే మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. పర్మీషన్స్ వచ్చినా స్టార్ హీరోలు చాలా మంది షూటింగ్ లకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. కరోనా టైమ్ లో సెట్స్ లో అడుగుపెట్టడం రిస్క్ అనుకుంటున్నారు. దీంతో ఏడాది మొదలు కావాల్సిన సినిమాలు వచ్చే ఏడాదికి వెళ్లిపోతున్నాయి. 

 

అల వైకుంఠపురములో సినిమాతో 2020కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ప్లాన్ చేశాడు పంచ్ మాస్టర్. పోస్ట్ సమ్మర్ తారక్ తో మూవీ మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ తో ట్రిపుల్ ఆర్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. తారక్ ఎప్పుడు ఫ్రీ అవుతాడు అనేది క్లారిటీ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశాడు త్రివిక్రమ్. 

 


సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తో స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇక ఈ ఉత్సాహంతో ఎఫ్-3 స్క్రిప్ట్ మొదలుపెట్టాడు. కానీ కథ మొదలు పెట్టిన టైమ్ లోనే లాక్ డౌన్ స్టార్ట్ అయింది. అయితే స్టోరీ రెడీ అయినా.. షూటింగ్ లో జాయిన్ కావడానికి వెంకటేశ్, వరుణ్ తేజ్ సిద్ధంగా లేరనే టాక్ వస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేశాడు అనిల్ రావిపూడి. 

 

నితిన్ అంధాదున్ రీమేక్ కు కూడా కరోనా లాక్ డౌన్ తో బ్రేకులు పడ్డాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక సురేందర్ రెడ్డి-రామ్ కాంబోలో రాబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాదికి వెళ్తుందని సమాచారం. ఇలా 2020లో స్టార్ట్ కావాల్సిన చాలా సిినిమాలు వచ్చే ఏడాదికి వెళ్లిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: