బాహుబలి బిగినింగ్, బాహుబ‌లి కన్‌క్లూజన్, సాహో వంటి పాన్ ఇండియా సినిమాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సాధించిన " యంగ్ రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ త‌న 20 వ సినిమాని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్  పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ సినిమాని "రెబ‌ల్‌స్టార్" కృష్ణంరాజు గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లో స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌ లు యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

 

ఇక ఇప్ప‌టికే యూర‌ప్ లాంటి విదేశాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని 70% టాకీ పార్ట్ ని పూర్తిచేస‌కుంది ఈ సినిమా. మిగ‌తా షూటింగ్ పార్ట్ ని కొవిడ్‌-19 ప్ర‌భావం క్రైసిస్ ముగిసిన వెంట‌నే సెట్స్ మీద‌కి తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అండ్ టైటిల్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకి రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ని "రాధేశ్యామ్" అంటూ ఎనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతుందని ఆయా భాషల పోస్టర్స్ ని రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

 

అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఒకేసారి టాలీవుడ్ కి ఎంటరైంది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాధం, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురములో లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ని దక్కించుకుంది. ఇక గతంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో పీరియాడికల్ మూవీ లో చేసింది. అయితే ఆ సినిమాలన్ని ఒకెత్తైతే ఇప్పుడు చేస్తున్న ప్రభాస్ ఒకెత్తని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే పోషిస్తున్న పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుందట. తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైన పాత్ర ఇది అని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: