రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే  జంటగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదలచేశారు. ప్రభాస్, పూజా రొమాంటిక్ ఫోజుతో వున్న ఈపోస్టర్ కు డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది అయితే అస్సాంలోని నాగోన్ పోలీసులు మాత్రం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కోవిడ్ -19 నిబంధనలను పాటించలేదని.. ప్రభాస్ , పూజా హెగ్డే లకు మాస్క్ లు వేసి ఈ ఏడాదికి తగ్గ పర్ఫెక్ట్ రాధే శ్యామ్ పోస్టర్ అంటూ మరో పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు అనంతరం మీకు ఇష్టమైన వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోమని చెప్పండి.. ప్రభాస్ కు ఇది చెపుదామని అనుకున్నాం కానీ మేము రీచ్ కాలేకపోయాం.. ఈమెసేజ్ ను ఫోటోషాప్ ద్వారా తెలియజేస్తున్నాం అని ట్వీట్ చేశారు. 
ఇక బాహుబలి ద్వారా ప్రభాస్ సౌత్ లోనే కాదు నార్త్ లోనూ భారీగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు అందుకనే అస్సాం పోలీసులు ,రాధే శ్యామ్ పోస్టర్ ద్వారా చెపితే మెసేజ్ చాలా మందికి  చేరుతుందని ఇలా చేశారు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నఈచిత్రం ఇప్పటివరకు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం తగ్గాక మిగితా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది ఈచిత్రం థియేటర్లలోకి రానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: