గత ఏడాది యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ సినిమా యువరేజ్ విజయాన్ని అందుకోవడంతో, మలి సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి, తన నెక్స్ట్ సినిమా దర్శకత్వ బాధ్యతలను జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణకు అప్పగించారు. ఆ విధంగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రారంభం అయి, ఇప్పటివరకు డెబ్భై శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. 

IHG

కాగా ఆ సినిమాకు నేడు రాధేశ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసారు సినిమా నిర్మాతలు. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ పై కృషంరాజు సమర్పణలో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగు సహా పలు ఇతర భాషలకు చెందిన నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రభాస్, నిన్న ఉదయం తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ కు ఏకంగా 1 మిలియన్లకు పైగా లైక్స్ దక్కడం విశేషం. 

 

అలానే మరోవైపు రాధేశ్యామ్ పేరుతో ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మిలియన్ల కొద్దీ హాష్ ట్యాగ్ లతో దానిని పరిగెత్తిస్తున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్. కొన్నేళ్ళ క్రితం యూరోప్ లో జరిగిన పీరియాడికల్ లవ్ స్టోరీ గా దర్శకుడు ఈ సినిమాని తెరెకక్కిస్తున్నాల్టు సమాచారం. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ని జరుపుకోనున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి...!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: