టాలీవుడ్ లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి, ముందుగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన కిలాడీ కృష్ణుడు సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత నుండి మెల్లగా తన ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగిన విజయశాంతి, ఆపై వచ్చిన అవకాశాలను విజయాలుగా మలుచుకుని స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. 

IHG

అప్పటి స్టార్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు దగ్గరి నుండి ఆ తరువాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన విజయశాంతి, అనంతరం సోలో నటిగా కర్తవ్యం, ప్రతిఘటన, ఆశయం సినిమాల సక్సెస్ లతో లేడీ సూపర్ స్టార్ ఎంతో గొప్ప పేరు గడించారు. సరిగ్గా పదమూడేళ్ల క్రితం సినిమాలకు విరామం పలికిన విజయశాంతి, ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. కాగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళి ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా ఆమె నటించిన క్యారెక్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 

 

అయితే దాని తరువాత వేరొక సినిమా ఇప్పటివరకు అంగీకరించని విజయశాంతి, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. లాక్ డౌన్ కు ముందు కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుందని, అలానే సినిమాని కీలకమైన మలుపు తిప్పే పాత్రలో విజయశాంతి ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై సదరు సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: