టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా వరకు యంగ్ హీరోల హవా కొనసాగుతోంది. ఎక్కువ మంది కుర్ర హీరోల పేర్లు సినీ ప్రపంచంలో వినబడుతున్నాయి. వారిలో ఒక పేరు విశ్వక్ సేన్. 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాతో హీరో గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సొంత డైరెక్షన్ చేసి 'ఫలక్ నుమా దాస్' సినిమాను రూపొందించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవటంతో హీరో విశ్వక్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. పక్కా తెలంగాణ మరియు హైదరాబాద్ యాసలో తీసిన ‘ఫలక్ నుమా దాస్’ సినిమా తీసి భారీ విజయం సాధించడంతో ఇండస్ట్రీలో విశ్వక్ కి కొత్త సినిమాల అవకాశాలు ‘క్యూ’ కట్టాయి.

 

దీంతో సినిమా విజయం సాధించిన సమయంలో.. హీరో విశ్వక్ మాట్లాడుతూ "నన్నెవడు లేపే అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటా" అనే ఘాటు వ్యాఖ్యలతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో కొత్త డైరెక్టర్ శైలేంద్ర డైరెక్షన్ లో హిట్ సినిమా చేసి అదిరిపోయే హిట్ ఏడాది ప్రారంభంలోనే విశ్వక్ సేన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అన్నా లోపు మహమ్మారి కరోనా వైరస్ రావటంతో విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది సస్పెన్స్ గా మారింది.

 

ఇలాంటి తరుణంలో వినపడుతున్న సమాచారం ఈ యంగ్ హీరో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'కప్పెలా' అనే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ తెలుగులో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నారట. అయితే ఈ వార్త విని చాలా మంది నెటిజన్లు మలయాళంలో ఫస్టాఫ్ లో కప్పెలా చాలా దరిద్రంగా ఉంటుందని... కెరియర్ మంచి టైమింగ్ లో ఇటువంటి సినిమా చేయొద్దని సూచిస్తున్నారు. మరోపక్క విశ్వక్ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు విధంగా 'కప్పెలా' స్టోరీ లో మార్పులు చేర్పులు చేసి తెలుగులో అందించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: