కరోనా మహామ్మారి వినోద పరిశ్రను కుదిపేస్తోంది. ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో సెలబ్రిటీలకు కూడా కరోనా సోకుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టెలివిజన్ పరిశ్రమకు చెందిన పలువురికి కరోనా పాజిటివ్ రాగా ఇతర ఇండస్ట్రీల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఓ బెంగాలీ నటికి ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బెంగాలీ నటి కోయల్ మాలిక్ కు కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది.
శుక్రవారం రాత్రి ఈ మేరకు కోయల్ మాలిక్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో తన తండ్రి లెజెండరీ బెంగాళీ నటుడు రంజిత్ మాలిక్, తన తల్లి దీపా మాలిక్, భర్త, నిర్మాత నిష్పల్ సింగ్లకు కూడా కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టుగా తెలిపింది. ప్రస్తుతం తాను కుటుంబ సభ్యులతో సహా క్వారెంటైన్లో ఉంటున్నామని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా బెంగాళీ సినిమా పరిశ్రమ షాక్కు గురైంది.
పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కోయల్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దర్శకుడు సత్రజిత్ సేన్, నటుడు విక్రమ్ ఛటర్జీ, జీత్లు కోయల్, కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేశారు.
Baba Ma Rane & I are tested COVID-19 Positive...self quarantined!
— Koel Mallick (@YourKoel) July 10, 2020
కోయల్ మాలిక్ ప్రస్తుతం బెంగాలీ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఘోరే అండ్ బైరే, చాయా ఓ చోబీ, శుభోద్రిష్టి, హెమ్లోక్ సోసైటీ లాంటి సినిమాలతో పాపుల్ అయ్యింది ఈ బ్యూటీ. కోయల్ 2013లో నిష్పల్ సింగ్ను పెళ్లి చేసుకుంది. వీరికి గత మేలో మగబిడ్డ జన్మించాడు.