1998లో విడుదలైన బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి రంభ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని మూడు పాటలు నవమి దశమీ తగిన రోజులు, సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారీ, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ కి మంచి పేరు వచ్చింది. బావగారు బాగున్నారా చిత్రం కూడా అతని కెరీర్లో ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవచ్చు.
2001 వ సంవత్సరంలో విడుదలైన నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణ సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులోని కో కో కోమలి, లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా, చిలకపచ్చ కోక , నిన్నా కుట్టేసినది పాటలు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత పాపులారిటీ సంపాదించి రికార్డులు తిరగరాసాయని అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా అనే పాట రెండు సంవత్సరాల పాటు పాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. కెరీర్ తొలినాళ్లలోనే ఇటువంటి భారీ చిత్రాలకు అద్భుతంగా సంగీతం అందించి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మణి శర్మ. అతని సినీ కెరీర్లో పోకిరి, ఖుషి, మురారి, చిరుత, పరుగు, బిల్లా, ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి( అందాల ఆడబొమ్మ సాంగ్ ), ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, ఆది, గుడుంబా శంకర్( ఏమంటారో, చిగురాకు చాటు చిలక), అతడు( నీతో చెప్పనా) వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Powered by Froala Editor