మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే సోలో గా కాకుండా విష్ణు ప్రసాద్ తో తో కలిసి ఆమె ఈ సిరీస్ ను నిర్మిస్తుంది. ఈరోజు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కాప్ అండ్ క్రిమినల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈసిరీస్ లో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ ,సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జీ 5 తెలుగు ఈవెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ లోకి తీసురానుంది. ఇక ఈవెబ్ సిరీస్ కు  ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో సిద్దార్థ్ తో ఓయ్ అనే సినిమా ను తెరకెక్కించాడు ఆనంద్ రంగ.. అయితే ఆ సినిమా పరాజయం చెందడం తో ఆతరువాత మరో సినిమా చేయలేదు ఇక ఇప్పుడు ఈ దర్శకుడు వెబ్ సిరీస్ తో ట్యాలెంట్ నిరూపించు కోవాలనుకుంటున్నాడు. 

 
కాగా ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఫుల్ డిమాండ్ వుంది. గత ఏడాది హిందీలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అప్పటి నుండి వెబ్ సిరీస్ ల మీద పడ్డారు దర్శక నిర్మాతలు అయితే ఇటీవల  తెలుగులో కూడా పలు వెబ్ సిరీస్ లు వచ్చాయి కానీ అందులో ఏ ఒక్కటి కూడా మెప్పించలేకపోయాయి. మరి ఇప్పుడు ఆనంద్ రంగ తీస్తున్న వెబ్ సిరీస్ అయినా ఆకట్టుకుంటుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: