మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి దాదాపు ఎనిమిది మంది హీరోలున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితమే ‘విజేత’ సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు తన రెండో సినిమా చేస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా కరోనా పరిస్థితులతో షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్ గా ప్రభుత్వ నిబంధనలు సడలించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఇందులో కల్యాణ్ దేవ్ సూపర్ మచ్చి కూడా ఉంది.

IHG

 

అయితే.. ప్రస్తుతం కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ గ్యాప్ లోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేసింది యూనిట్. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ షూటింగ్ నిలిపేశారు. అయితే.. కరోనా తీవ్రత దృష్ట్యా కల్యాణ్ దేవ్ షూటింగ్ అయ్యాక సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లపాటు ఎవరితో కలవలేదు. తన ఇంట్లోనే జరిగిన తన కూతురు పుట్టినరోజుకు కూడా హాజరు కాకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయాడు. ఇప్పుడు కల్యాణ్ కు ట్రునాట్ టెస్టులు చేశారు. ఇందులో కరోనా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో భార్య శ్రీజ.. ఇద్దరు కూతుళ్లతో కలిసి మళ్లీ సంతోషం పంచుకున్నాడు.

IHG'Super Machi ...

 

వారితో దిగిన ఓ సెల్పీని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘కరోనా టెస్టుల్లో నెగటివ్ రావడం సంతోషంగా ఉంది. మళ్లీ నా కుటుంబంతో కలిశాను. చాలా సంతోషంగా ఉంది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనిపై మెగాభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రిప్లై ఇస్తున్నారు. సూపర్ మచ్చిలో హీరోయిన్ గా రుచితా రామ్ నటిస్తోంది. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: