సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా మహర్షి సినిమాను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి మహేష్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఆ సినిమా తర్వాత మహేష్ సరిలేరు నీకెవ్వరుతో కూడా హిట్టు కొట్టాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట అంటూ పరశురాం డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అసలైతే పరశురాం సినిమాకు ముందు మహేష్ 27వ సినిమా వంశీ పైడిపల్లి డరక్షన్ లో రావాల్సి ఉంది కాని కుదరలేదు. వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ నచ్చినా ఫుల్ స్క్రిప్ట్ శాటిస్ఫై కాకపోవడంతో మహేష్ వంశీ సినిమా చేయలేదు.

 

మహర్షి తర్వాత కూడా మహేష్ సినిమా ఉంటుందని ఆశపడ్డ వంశీ పైడిపల్లికి షాక్ తగిలింది. మిగతా హీరోలు కూడా అందరు బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లికి మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఆల్రెడీ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఎవడు సినిమా చేశాడు రాం చరణ్. ఆ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించాడు. చరణ్ ఇమెజ్ కు సూటయ్యే ఓ కథ సిద్ధం చేశాడట వంశీ పైడిపల్లి. త్వరలోనే చరణ్ తో చర్చలు జరుపుతాడని టాక్.

 

ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా కొమరం భీం పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. మరి ట్రిపుల్ ఆర్ తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లోనే రాం చరణ్ సినిమా ఉంటుందన్న వార్తలు రాగా త్వరలోనే ఈ కాంబోపై మరోసారి క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. తను ఛాన్స్ ఇవ్వాలనుకుంటే డైరక్టర్ ముందు హిట్టు కొట్టాడా ఫ్లాపు తీశాడా అని లెక్క చూడని రాం చరణ్. వంశీ కాంబో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: