ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ ఇద్దరు... రష్మిక  మందన, పూజ హెగ్డే. వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన తెలుగు లో వరుసగా సినిమాల్లు చేస్తూ తమ మార్క్ వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇద్దరూ కూడా ఈ ఏడాది రెండు సినిమాల్లో హిట్స్ కొట్టారు. పూజ ఒక సినిమాలో హిట్ కొత్తగా రష్మిక రెండు సినిమాల్లో అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో హిట్స్ కొట్టి తన మార్క్ వేసింది అనే చెప్పాలి. ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి ఇప్పుడు అనే సంగతి తెలిసిందే. 

 

దాదాపు ఆమె మూడేళ్ళ వరకు బిజీ గానే ఉంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో దర్శక నిర్మాతలు ఒక కండీషన్ పెడుతున్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. అవును  ఇప్పుడు వీరు ఇద్దరూ సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యాలి అనే షరతు పెడుతున్నారు. అదే విధంగా ఒక సినిమాకు డేట్స్ ఇవ్వడమే కాదు ప్రచారం లో కూడా తమ వంతు పాత్ర అనేది ఉండాలి అని స్పష్టం చేస్తున్నారు అని టాక్. 

 

ఇటీవల రష్మిక కు సినిమా చెప్పిన సమయ౦లో పుష్ప సినిమా నిర్మాతలు ఇదే విధంగా ఆమెకు స్పష్టంగా చెప్పారు అని ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ఇక పూజ కూడా దాదాపు అదే విధంగా చెప్పింది అనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో ప్రధానంగా వినపడుతుంది మరి. ఇక చూడాలి అసలు వారు ప్రచారం చేస్తారా లేదా అనేది మరి. ఇప్పుడు ఇద్దరి చేతిలో మూడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వారి సినిమాలు రానున్నాయి ప్రేక్షకుల ముందుకి. లాక్ డౌన్ లో ఆగిపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: