బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ రాజ్ పుత్ ముంబై లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం బాలీవుడ్ తీవ్ర చర్చకు కారణమైంది. ఇండస్ట్రీలోని నెపోటిజం (వారసత్వం) కారణం గానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి.
గత 6 నెలల కాలంలో సుశాంత్ నాలుగు భారీ ప్రాజెక్ట్ లు కోల్పోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి వారు మాఫియాలా మారి కొత్తగా వచ్చేవారిని ఇబ్బందుల పాలు చేస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుశాంత్ మరణంపై అనుమానాలు తలెత్తటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్నారు. దీంతో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
దీంతో సుశాంత్ తో పరిచయం ఉన్న చాలా మంది మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సుశాంత్ గర్ల్ ప్రెండ్స్ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు ఫ్యాన్స్. గర్ల్ ఫ్రెండ్స్ దూరం చేసిన కారణంగానే సుశాంత్ మానసికంగా కృంగిపోయాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాధకుతోడు అవకాశాలు తగ్గటంతో డిప్రెషన్కు గురయ్యాడని భావిస్తున్నారు.
అయితే తాజాగా సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోంఖడే గురించి సుశాంత్ తండ్రి స్పందించాడు. సుశాంత్కు దూరమైన తరువాత కూడా అంకిత తమ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేదని చెప్పాడు. సుశాంత్ చరిపోయిన తరువాత కూడా పాట్నా వచ్చి తమ ఫ్యామిలీని పరామర్శించిందని చెప్పాడు. సుశాంత్ విషయంలో అంకితను బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాడు సుశాంత్ తండ్రి కేకే సింగ్.