రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ నిన్న విడుదలకాగా...సోషల్ మీడియాలో ఆల్ టైం రికార్డులు సృష్టించింది. అందులో భాగంగా 24 గంటల్లోనే 6.3 మిలియన్లకు పైగా ట్వీట్స్ తో రికార్డు సృష్టించగా 3.2 మిలియన్ల కు పైగా ఇంటరాక్షన్స్ ను, 2.8 మిలియన్లకు లైకులను అలాగే 35 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ లతో సరికొత్త రికార్డు సృష్టించిందని యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది అయితే తెలుగుతోపాటు,తమిళ ,మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈఫస్ట్ లుక్ విడుదలకావడంతో ఈరికార్డులు సాధ్యమయ్యాయి. 
జిల్ ఫేమ్  రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా కృష్ణం రాజు ,భాగ్య శ్రీ ,మురళి శర్మ , షాషా ఛత్రి, సచిన్ కెడ్కర్, కునాల్ రాయ్ కపూర్ ,సత్యాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ ,గోపి కృష్ణ మూవీస్ ,టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. ఇక ఇప్పటివరకు రాధే శ్యామ్ 70శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా ప్రభావం తగ్గాక మిగిలిన షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: