మహమ్మారి కరోనా వైరస్ రావటంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం అవకాశాలు కూడా రావడం లేదు. చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లు పెద్ద సినిమా ప్రాజెక్టు చేయాలని... OTT అవకాశాలను వదిలేసుకుంటూన్నారు. ఇలాంటి తరుణంలో 'మహానటి' సినిమా తో మంచి పాపులారిటీ క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

IHG

ఒకపక్క థియేటర్లో రిలీజయ్యే సినిమాల అవకాశాలు అందుకుంటున్న కీర్తిసురేష్ మరోపక్క OTT లో వస్తున్న అవకాశాలను కూడా వదులుకోవడం లేదు. కీర్తి దగ్గరికి చాలావరకు లేడీ ఓరియంటెడ్ సినిమా ప్రాజెక్టులు రావడంతో ప్రస్తుతం ఉన్న సమయాన్ని కీర్తి సురేష్ OTT సినిమా ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో పడిందట. ఇప్పటికే పెంగ్విన్ సినిమాతో OTT ప్రేక్షకులను అలరించిన కీర్తిసురేష్ త్వరలోనే మరో రెండు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

IHG

ఇండస్ట్రీలో  స్టార్ హీరోయిన్లు గా రాణిస్తున్న వారికి OTT లో అవకాశాలు వచ్చినా పక్కకు పెట్టడం తో ప్రస్తుతం కీర్తి సురేష్ మాత్రం అవకాశాలను అందుకుని నెంబర్ వన్ హీరోయిన్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కొనసాగుతోంది. మరోపక్క నితిన్ తో ఏకంగా రెండు సినిమాలలో కీర్తి సురేష్ నటించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: