కంగనా రనౌత్ ని టచ్ చేయడం కంటే.. ప్లగ్గులో వేలు పెట్టడం బెటర్ అనే కామెంట్స్ మళ్లీ మొదలయ్యాయి. కంగనా-పూజా భట్ ఇష్యూతో బాలీవుడ్ లో మళ్లీ మాటల యుద్ధం స్టార్ట్ అయింది. నువ్వు ఎంత అంటే.. నీ ఫ్యామిలీ మొత్తం అంతే అని సోషల్ మీడియా యుద్ధం చేస్తున్నారు. 

 

ఒకవైపు కరోనా మహారాష్ట్రను వణికిస్తుంటే.. మరోవైపు ముంబయిలో హీట్ పెంచుతోంది కంగనా రనౌత్. మహేశ్ భట్ ఫ్యామిలీతో సోషల్ మీడియాలో వార్ చేస్తూ బాలీవుడ్ లో రచ్చచేస్తోంది. మహేశ్ భట్ ఫ్యామిలీ నెపోటిజాన్ని పెంచి పోషిస్తుందని కంగనా మాట్లాడగానే.. మహేశ్ భట్ కూతురు మాజీ హీరోయిన్ పూజా భట్ రియాక్ట్ అయింది. దీంతో కంగన యాజ్ యూజువల్ గా రంగంలోక దిగిపోయింది. 

 

కంగనా రనౌత్ చాలా రోజుల నుంచి నెపోటిజంపై గొడవ చేస్తోంది. బాలీవుడ్ లో టాలెంట్ కంటే వారసులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని కరణ్ జోహార్ టాక్ షోలో కరణ్ పైనే విమర్శలు చేసింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాక ఈ మాటల దాడి మరింత పెంచింది. సుశాంత్ సూసైడ్ చేసుకుంటాడని తాను ముందే ఊహించానని మహేశ్ భట్ స్టేట్ మెంట్ ఇవ్వగానే భట్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది కంగనా. 

 

కంగన విమర్శలపై పూజా భట్ రియాక్ట్ అయింది. మా నాన్నే గ్యాంగ్ స్టార్ సినిమాతో కంగనాని బాలీవుడ్ కు పరిచయం చేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజ. దీనికి కంగన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మహేశ్ కొత్త వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఫ్రీగా యాక్ట్ చేయించుకుంటాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేయించింది. అలాగే సుశాంత్-రియా రిలేషన్ లో మీ నాన్న ఎందుకు వేలుపెట్టాడు.. అతను చనిపోతాడని మీ నాన్నకు ముందే ఎలా తెలుసు.. వెళ్లి నాన్నని ఈ ప్రశ్నలకు సమాధానం అడమని సోషల్ మీడియాలో పోస్ట్ చేయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: