గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇటీవల నాగార్జున ఈఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలునాటగా అనంతరం తన కోడలు సమంత ను ఈఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. ఇక తాజాగా ఈసవాలును స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నాగార్జునతో కలిసి మొక్కలు నాటింది సమంత. అనంతరం కీర్తి సురేష్ ,రష్మిక మందన్న లను ఈఛాలెంజ్ కు నామినేట్ చేసింది. అంతేకాదు ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని సమంత పిలుపునిచ్చింది. ఈసందర్భంగా ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు సమంత కృతజ్ఞతలు తెలిపింది.
ఇదిలాఉంటే గత ఏడాది ఓ బేబీతో సూపర్ హిట్ కొట్టిన సమంత ఈచిత్రం తరువాత తెలుగులో ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు అయితే సినిమాల్లో కాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కీలక పాత్రలో నటించింది. ఆమెకు ఇదే మొదటి వెబ్ సిరీస్.  త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నాగార్జున మాత్రం ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. సాల్మోన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాగ్, ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: