అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చి హీరోగా సినిమాలు చేస్తున్న సుశాంత్ చిలసౌ సినిమాతో హిట్టు కొట్టగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ పూర్తయ్నట్టు తెలుస్తుంది. ఇచట వాహనములు నిలపరాదు టైటిల్ తో వస్తున్న సుశాంత్ ఈ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో చాట్ చేసే సుశాంత్ తన సినిమాలకు సంబందించిన ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. 

 

ఇక లేటెస్ట్ గా సుశాంత్ తో ఫ్యాన్స్ చేసిన చిట్ చాట్ లో సూపర్ స్టార్ సర్కారు వారి పాట పోస్టర్ ప్రస్థావన తెచ్చారు. ఆ పోస్టర్ చూడగానే మీకు ఏమనిపించింది అని అడగగా మహేష్ మెడ మీద టాటూ, క్రాఫ్ బాగున్నాయని అన్నాడు. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. సకారు వారి పాట సినిమా గురించి సెలబ్రిటీస్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాక్ ఉందని సుశాంత్ మాటలని బట్టి తెలుస్తుంది.

 

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే అన్ని సాంగ్స్ కి ట్యూన్స్ ఫైనల్ చేశాదట థమన్. ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న థమన్ మహేష్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.                 

మరింత సమాచారం తెలుసుకోండి: