బాలీవుడ్ లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అలాగే ఆయన కొడుకు, హీరో అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో వీరిద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈవిషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా అమితాబ్ ,అభిషేక్ లే వెల్లడించారు. ముందుగా అమితాబ్ కు పాజిటివ్ రాగ కొద్దీ సేపటి తరువాత అభిషేక్ కు కూడా పాజిటివ్ అని తేలింది ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల రిపోర్ట్ రావాల్సివుంది.
 
ఇక నాకు కరోనా పాజిటివ్ అని తేలింది దాంతో ఆసుపత్రిలో చేరాను. గత 10రోజుల నుండి నన్ను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు అలాగే నాకు.. మానాన్నకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తేలికపాటి లక్షణాలతో ఇద్దరం ఆసుపత్రిలో చేరాం. అందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అభిషేక్ ట్వీట్ చేశాడు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: