టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఎంత హిట్ అయినా సరే ఏదోక వివాదంలో ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొన్ని కొన్ని సీన్స్ విషయంలో  లేదా కథ విషయంలో ఎప్పుడు కూడా ఏదోక వివాదమ నేది సినిమాలను చాలా బాగా నరకం చూపిస్తూ ఉంటుంది అనే చెప్పాలి. మన తెలుగు లో శ్రీమంతుడు సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా ఒక సంచలనం అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. కాని ఈ సినిమాను మాత్రం వివాదాలు బాగా ఇబ్బంది పెట్టాయి అనే చెప్పాలి. సినిమాలో చాలా సీన్స్ విషయంలో వివాదం అనేది వచ్చింది. 

 

అలాగే సినిమా కథ విషయంలో కూడా చాలా వరకు వివాదం నడిచింది అనే చెప్పాలి. సినిమా కథ అసలు కొరటాల శివ ది కాదు అని తాను రాసుకున్న కథ అని ఒక వ్యక్తి ఏకంగా కోర్ట్ కి వెళ్ళడం తో మహేష్ బాబు కొరటాల శివ ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఇక ఈ సినిమా కథ విషయంలో వచ్చిన  వివాదం తో సినిమాను నిలిపివేయాలి అని హక్కులు కూడా మార్చాలి అని చాలా మంది అప్పుడు డిమాండ్ కూడా చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా కథ తమదే అని చెప్పుకోవడానికి హక్కుల కోసం కథ రాసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చారు అనే ఆరోపణ కూడా ఉంది. 

 

ఆ విధంగా ఈ సినిమా దాదాపుగా వివాదాలతో సావాసం చేస్తూ వచ్చింది అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు  మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: