టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలను వివాదాలకు దూరంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని ఏదోక వివాదం సినిమాలను ఏదోక రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సినిమాలు బాగానే ఇబ్బంది పడుతూ ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఏదోక విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటాయి. మన తెలుగు లో ఫ్లాప్ అయినా సరే సినిమాలు మాత్రం వివాదాలతో ఎక్కువగా సావాసం చేస్తూ ఉంటాయి. 

 

అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి సినిమాను ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఏదో హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు అని ఆ సినిమా దర్శకుడు నానా యాగీ చేసాడు. ఇండియా కూడా వచ్చి అతను నోటీసులు కూడా ఇచ్చాడు. అప్పుడు ఇది సంచలనంగా మారింది. ఈ సినిమాలో చాలా సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అని అందుకే వివాదం వచ్చింది అని అంటారు. ఇక ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా పూర్తి చేయడానికి కాపీ కొట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

 

సినిమా విషయంలో కనీసం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అని అన్నారు. కాగా ఈ సినిమా  ఫ్లాప్ అయింది. దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నా... ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కాస్త కష్టమే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: