బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్, దేశవ్యాప్తంగా అభిమానులని ఏర్పర్చుకున్నాడు. సాహో సినిమాతో అతడి ప్రభంజనం నార్త్ లో ఎలా ఉందో అందరికీ అర్థమైపోయింది. దక్షిణాదిన ఈ సినిమా అంతగా ప్రభావం చూపకపోయినా ఉత్తరాది జనాలని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులోని మాస్ సీన్స్ అక్కడి వారిని బాగా ఆకట్టుకున్నాయి. అందువల్లే అక్కడ 150కోట్లకి పైగా వసూళ్ళు సాధించింది.

 

 

అయితే తాజాగా ప్రభాస్ 20వ చిత్రం రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. ఎన్నో రోజులుగా ఈ సినిమాపై అప్డేట్ కావాలని నిరీక్షిస్తున్న అభిమానులకి చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ తో డబల్ ట్రీట్ ఇచ్చింది. అయితే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ పలు రికార్డులు సృష్టించినప్పటికీ మిశ్రమ స్పందనలు వచ్చాయి.

 

 

ముఖ్యంగా ఉత్తరాది వారిని అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. అయితే దానికి కారణం రాధేశ్యామ్ పూర్తి ప్రేమ కథా చిత్రం అవడమే కారణం అంటున్నారు. బాహుబలి, సాహో సినిమాలు ఉత్తరాదిన అంతగా ఆదరణ పొందడానికి కారణం అందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అని, కానీ రాధేశ్యామ్ లో అలాంటివేవీ కనిపించట్లేదని అందువల్లే అక్కడివారు ఫస్ట్ లుక్ పట్ల అంత ఉత్సాహం చూపించట్లేదని చెబుతున్నారు.

 

అయితే ప్రేమకథా చిత్రాల్లోనూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇదివరకు ప్రభాస్ అలాంటి సినిమాలు చాలానే చేసాడు. మరి ఈ సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఆశిస్తున్నారు. చూడాలి మరేం జరుగుతుందో. 2021లో రిలీజ్ కి సిద్ధం అవబోతున్న ఈ సినిమాకి రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: