టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `ర‌చ్చ‌`. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది.  ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకుర్చారు. యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్‌గా 2012 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం.. మంచి విజ‌యాన్నే అందుకుంది. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందు పెద్ద ర‌చ్చ జ‌రిగింది. 

IHG

ఇరవై ఏళ్ల క్రితం `గ్యాంగ్ లీడర్` సినిమాలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన `వానా వానా వెల్లువాయే` పాటను రామ్ చరణ్ తన 'రచ్చ' సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ అవ్వ‌డంతో ఈ పాట కీల‌క పాత్ర వ‌హించింది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ  పాటను గౌతం బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించారు. ఈ పాటలో అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించారని వారి వెనుక గౌతమ బుద్దున్ని ఉంచారని ఇది సరికాదని జాతీయ అరుంధతీ మహిళా శక్తి అప్ప‌ట్లో నిరసన చేప‌ట్టింది.

IHG

చిత్ర దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు. గౌతమ బుద్దుని చైనా, థాయ్‌లాండుతో పాటు మన దేశంలోనూ భగవంతుడి వలె పూజిస్తారని అరుంధతి మహిళా శక్తి సభ్యులు చెప్పారు. అలాగే మ‌రోవైపు ఈ పాట మూల రచయిత భువనచంద్రకు రెమ్యునేషన్ ఇవ్వలేదు. దాంతో ఆయనకు రెమ్యునేషన్ ఇవ్వాలని నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే నిర్మాతలు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు. ఇది కూడా పెద్ద వివాద‌మే సృష్టించింది. ఇక చివ‌ర‌కు అన్ని వివాదాలు దాటుకుని విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకున్నారు.

 
 
  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: