సోషల్ మీడియాలో ఛాలెంజిలు ఏ విధంగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఛాలెంజిల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఏ విషయంలోనైనా తమలాగా ఫాలో అవ్వాలనే ఉద్ద్శేశ్యంతో ఈ ఛాలెంజిలు విసురుతుంటారు. అయితే ఇలాంటి ఛాలెంజిల్లో చాలా మటుకు సమాజానికి ఏమాత్రం ఉపయోగపడనివే అయి ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం కరోనా సమయంలో ఉన్నాం.

 

ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న చాలా ఛాలెంజిలు సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బీ ద రియల్ మాన్ అంటూ ఇంటిపనులు చేసే ఛాలెంజిని విసిరితే దాన్ని స్వీకరించిన చాలా మంది సెలెబ్రిటీలు రియల్ మాన్ అనిపించుకున్నారు. మొన్నటికి మొన్న ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజిని విసిరాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

అయితే తాజాగా శ్రీ విష్ణు సరికొత్త ఛాలెంజితో ముందుకు వచ్చాడు. డొనేట్ ప్లాస్మా అండ్ సేఫ్ లైఫ్ అనే ఛాలెంజిని విసురుతున్నాడు. కరోనా మహమ్మారి వలన రోజూ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కరోనాతో పోరాడలేక తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. అయితే కరోనా బారిన పడి సీరియస్ గా ఉన్న వారిని ప్రాణాలని కాపాడానికి కరోనా సోకి నయం అయినవారి ప్లాస్మాని ఎక్కిస్తే మంచి ఫలితం ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

అందుకే ప్రస్తుతం ప్లాస్మా డొనేట్ చేయాలన్న ఆలోచనతో శ్రీ విష్ణు ఈ ఛాలెంజిని తీసుకువచ్చాడు. ఈ మేరకు ప్లాస్మా డొనేట్ కి రెడీగా ఉన్నవారు తమ ప్రొఫైల్ పిక్ ని డొనేట్ ప్లాస్మా అండ్ సేఫ్ లైఫ్ అనే డిస్ ప్లే పిక్ పెట్టుకోవాలని సూచించాడు. కరోనా కారణంగా ఎంతో మంది అవస్థలు పడుతున్న ఇలాంటి టైమ్ లో వారి ప్రాణాలని కాపాడాలన్న లక్ష్యంతో వినూత్నమైన ఛాలెంజితో వచ్చిన శ్రీ విష్ణుని అభినందించాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: