ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ముద్దుల తనయ శ్రద్ధ కపూర్ ముందుగా ఆషీకీ 2 సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధ, ఆ తరువాత హీరోయిన్ గా బాగానే అవకాశాలు దక్కించుకున్నారు. ఇక ఒక్కో సినిమాతో కూడా హీరోయిన్ గా తన నటన, అందంతో ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మకు యువతలో విశేషమైన క్రేజ్ ఉంది. ఇక ఇటీవల తొలిసారిగా సౌత్ సినిమా అయిన సాహో లో హీరోయిన్ గా నటించింది శ్రద్ధ. 

IHG

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఎంతో భారీ ఖర్చుతో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ సక్సెస్ ని అందుకుంది. అయితే బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ కు శ్రద్ధ ఇమేజ్ తోడవడంతో అక్కడ మాత్రం బాగానే వసూళ్లు అందుకుంది. ఇకపోతే ఆ సినిమా సౌత్ లో ఆశించిన రేంజ్ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంత ఢీలా పడ్డ శ్రద్ద, ఆపై మరికొన్ని సౌత్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని ఒప్పుకోలేదట. 

 

అయితే ఇటీవల రెండు రోజుల నుండి కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే, అతి త్వరలో ఒక స్టార్ హీరోతో, టాలీవుడ్ బడా దర్శకుడు ఒకరు ప్రారంభించనున్న  సినిమాలో శ్రద్ధ హీరోయిన్ గా ఎంపికయిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా రావడంతో, మరికొద్దిరోజుల్లో హీరోయిన్, సహా మిగతాగ నటీనట వర్గాన్ని ప్రకటిచనుందట సినిమా యూనిట్. వాస్తవానికి ఇటీవల పలు ఆఫర్లు వదులుకున్న శ్రద్ద, ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎంతో నచ్చడంతో వెంటనే ఓకే చేసిందట. ఆ విధంగా సాహో తో హిట్ మిస్ అయిన హిట్, ఈ సినిమాతో ఖచ్చితంగా దక్కుతుందని శ్రద్ధ భావిస్తోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం, ఇంతకీ ఆ స్టార్ హీరో, బడా డైరెక్టర్ కాంబో సినిమా ఏదై ఉంటుందా అని అప్పుడే ప్రేక్షకులు చర్చలు మొదలెట్టేశారు. మరి ఈ వార్త కనుక నిజం అయితే మరొక్కసారి తెలుగు తెరపై శ్రద్దని హీరోయిన్ గా చూడవచ్చన్నమాట.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: