గతేడాది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ సాహో తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా వరుస విజయాల భామ పూజ హెగ్డే నటిస్తుండగా, గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలపై కృష్ణంరాజు సమర్పణలో ఎంతో భారీ రేంజ్ లో మూవీ తెరకెక్కుతోంది. 

IHG

పలు భాషలకు చెందిన ప్రఖ్యాత నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రేమపావురాలు సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ, ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెబ్బైశాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన యువరత్న రానాలో నటించిన భాగ్యశ్రీ, ప్రస్తుతం రాధేశ్యామ్ ద్వారా మళ్ళి తెలుగు పరిశ్రమకు రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం మరొక సినిమాలో కూడా ఎంపికైనట్లు లేటెస్ట్ టాక్. అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారు పాట సినిమాలో మహేష్ కు తల్లి పాత్రకు గాను భాగ్యశ్రీ ఎంపికైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. 

 

మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఎంతో గ్రాండ్ గా నిర్మించనున్నాయి. సినిమాలో హీరో తల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండడంతో, ఆ పాత్రకు గాను భాగ్యశ్రీ అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శక, నిర్మాతలు, ఇటీవల ఆమెను సంప్రదించగా, ఆమె వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, ప్రభాస్ సినిమా తరువాత మహేష్ సినిమా ద్వారా కూడా భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయం....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: