బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమవుతుంది. 3వ సీజన్ హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే ఈ సీజన్ కు హోస్ట్ గా కొనసాగుతారని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తారని అంటున్నారు. మొదటి మూడు సీజన్లలో కంటెస్టంట్స్ విషయంలో రాజి పడగా ఈసారి సీజన్ 4లో మాత్రం స్టార్స్ ని దించుతున్నారట. బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ స్మాల్ స్క్రీన్ జోడీ వస్తున్నారట. వివాదాస్పద బుల్లితెర జంట రవి, లాస్యలను కూడా ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది.

 

బుల్లితెర మీద సంథింగ్ సంథింగ్ అంటూ మొదలుపెట్టి రకరకాల షోలతో అలరించిన రవి, లాస్యలు షోకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లిద్దరు షో చేస్తున్న టైం లో వీళ్ల మధ్య రిలేషన్ షిప్ గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే లాస్య పెళ్లి తర్వాత ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డది. అయితే ఆ తర్వాత లాస్య ఓ ఇంటర్వ్యూలో రవితో తన రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో హాట్ న్యూస్ గా మారాయి. లాస్య బుల్లితెరకు బ్రేక్ ఇచ్చి మంఝునాథ్ ను పెళ్లాడింది. ఇక ఫైనల్ గా లాస్య టాక్స్ అంటూ ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ లో వీడియోస్ చేస్తూ అలరిస్తుంది.

 

పెళ్లి తర్వాత రవి, లాస్యలు మళ్లీ షోలు చేయలేదు. అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టంట్స్ గా వీళ్లిద్దరు వస్తే షోకి వచ్చే క్రేజ్ బాగుంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. మరి బిగ్ బాస్ సీజన్ 4లో రవి, లాస్యలు కంటెస్టంట్స్ గా వస్తారన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. రవి మాత్రం బుల్లితెర మేల్ యాంకర్స్ లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: