మాస్ మహారాజ రవితేజ కి ఫ్లాపులతో పనిలేదు. ఆయన క్రేజ్ అలా ఉంది. రాజా ది గ్రేట్ కంటే ముందు అన్ని వరస ఫ్లాపులే వచ్చాయి. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ తో రవితేజకి ఒక మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫేట్ మారుతుందనుకున్నాడు రవితేజ. కాని మళ్ళీ టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ..ఇలా అన్ని వరసగా ఫ్లాపులొస్తూనే ఉన్నాయి. అయినా రవితేజ కి డిమాండ్ బాగానే ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత రవితేజ రైడ్, 7, రాక్షసుడు చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించబోయో సినిమాలో నటించబోతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫాం లోకి వచ్చిన నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా ఐటం సాంగ్ లో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రానా రవితేజ కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ లో నటించబోతున్నారని తెలుస్తుంది. మళయాళంలో సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియం రీమేక్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నారు. ఈ రీమేక్ లో రవితేజ, రానా నటించబోతున్నారట. కరోనా ఎఫెక్ట్ తగ్గితే నవంబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందట.
ప్రస్తుతం రానా, సాయిపల్లవి, ప్రియమణి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'విరాటపర్వం'. సాయి పల్లవి, ప్రియమణి ఈ సినిమాలో నక్సలైట్స్ గా కనిపించనుండగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. డి. సురేష్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రానా అరణ్య అన్న సినిమాలోను నటిస్తున్నాడు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రానా అడవి మనిషిగా నటిస్తుండగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.