మల్టీస్టారర్ సినిమాలు బాగా వస్తున్న ఈ టైంలో మరో క్రేజీ కాంబినేషన్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. అది ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి సినిమా చేస్తారట. ఇప్పటికే రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అసలైతే ఈ సినిమాకు ముందు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి ఓ లైన్ చెప్పగా దానికి ఓకే చెప్పిన మహేస్ ఫుల్ స్క్రిప్ట్ నచ్చక ఆ ప్రాజెల్ట్ పక్కన పెట్టాడు.

 

ఇక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి హీరోగా రాం చరణ్ పేరు వినిపిస్తుంది. ఆల్రెడె చరణ్ తో వంశీ పైడిపల్లి ఎవడు సినిమా చేశాడు. ఈ కాంబో సినిమా అనగానే ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే వంశీ పైడిపల్లి, చరణ్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా భాగమవుతున్నాడట. అదేంటి వంశీ ఏదైనా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడా అంటే అలాంటిది ఏమి లేదు కాని మహేష్ కోసం అనుకున్న ఈ కథను చరణ్ చేస్తుండగా సినిమా మిస్సైనందుకు చరణ్ సినిమాను మహేష్ నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. 

 

మహేష్ జి.ఎం.బి ప్రొడక్షన్ ఫుల్ టైం సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని చూస్తుంది. అదేదో చరణ్ సినిమాతో చేస్తే బెటర్ కదా అని భావిస్తున్నారట. మహేష్, చరణ్ ల మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. అందుకే మహేష్, చరణ్ కలిసి వంశీ పైడిపల్లి సినిమా చేస్తారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తయ్యే వరకు చరణ్ ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేసే ఛాన్స్ లేదు. మరి ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ఫైనల్ అప్డేట్ వస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: