టాప్ దర్శకుల ప్లాన్స్ అన్నింటికీ కరోనా చెక్ పెట్టింది. తాము తీస్తున్న సినిమాలకు సంబంధించి ఏఒక్కపని అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోవడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ దర్శకుల పరిస్థితి అత్యంత అయోమయంగా ఉంది అన్నమాటలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా సినిమాలు తీసే విషయంలో పక్కా ప్లాన్ తో ఉండే సుకుమార్ పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. సుకుమార్ తాను తీసే సినిమాలను చాల నిదానంగా తీయడమే కాకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి సీన్ విషయంలోనూ శ్రద్ధ పెట్టడమే కాకుండా ఆ సీన్ షూట్ చేసిన తరువాత మరుసటి రోజునే ఆ సీన్ లో మార్పులు చేర్పులు చేసుకోవడం సుకుమార్ అలవాటు.


దీనికితోడు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే సుకుమార్ కు తక్కువమంది యూనిట్ సభ్యులతో షూట్ చేయడం ఏమాత్రం అలవాటు లేదు. అయితే కరోనా పరిస్థితులతో రాజీపడుతూ సుకుమార్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించవలసి ఉన్న ‘పుష్ప’ మూవీ విషయంలో ఒక 3 పాయింట్ ఫార్మలాను డిజైన్ చేసినట్లు టాక్. వాస్తవానికి ఈమూవీ షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో షూట్ చేయాలని సుకుమార్ భావించాడు.


అయితే ఇప్పుడు అది కష్టం అన్నభావన రావడంతో హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న మహబూబ్ నగర్ అడవుల్లో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లాన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అదికుదరకపోతే అన్నపూర్ణ స్టుడియోలో కృత్రిమ ఫారెస్ట్ ఏర్పాటు చేసి అక్కడ షూట్ చేయడం మరొక ప్లాన్. అదీ కుదరకపోతే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక సెట్ లో రెండు పాటలను బన్నీ రష్మిక లపై చిత్రీకరించడం. ఈ మూడు ప్లాన్స్ కు ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ రష్మిక ఓకె చెపుతున్నా అల్లు అర్జున్ నుండి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాకుండా కరోనా కు వ్యాక్సిన్ వస్తే కాని తాను షూటింగ్ లకు రాను అంటూ సుకుమార్ కు సమాధానం ఇస్తున్నట్లుగా గాసిప్పులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీని ఎలా ఒప్పించాలో తెలియక సుకుమార్ తల పట్టుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల లీకులు హడావిడి చేస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: