మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా గత సంవత్సరం విడుదలైన ‘మహర్షి’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మహేష్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో హైయస్ట్ కలక్షన్స్ ఇచ్చిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈమూవీలను మహేష్ పాత్రకు అనేక ప్రశంసలు కూడ లభించాయి.


ఈమూవీ ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ తాను వెంటనే మరొక సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తో చేయబోతున్నట్లు ఓపెన్ గానే చెప్పాడు. ఈమాటలు నమ్ముకుని వంశీ పైడిపల్లి మహేష్ కోసం ఒక మంచి కథను కూడ రెడీ చేసాడు. అయితే ఏమైందో తెలియదు కాని ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ తన ఆలోచనలు మార్చుకుని వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చి పరుశు రామ్ మూవీ ‘సర్కారు వారి పాట’ కు ఓకె చేసాడు.


దీనితో ఊహించని ఈ టర్న్ కు షాక్ అయిన వంశీ పైడిపల్లి ఏమిచేయాలో తెలియక తన తరువాత ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అనేకమంది హీరోల చుట్టూ తిరిగాడు. ఇలాంటి పరిస్థితులలో వంశీ పైడిపల్లికి ఊహించని ఉపసమనం కోసం రామ్ చరణ్ నుండి లభించింది అంటూ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు వంశీ పైడిపల్లి రామ్ చరణ్మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ‘ఎవడు’ మూవీ ద్వారా తనకు మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి కృతజ్ఞతగా రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో చరణ్ ఈమూవీ ఫైనల్ స్క్రిప్ట్ ను తయారు చేయమని వంశీ పైడిపల్లికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో చివరి వరకు చరణ్ ఇదే మాట పై నిలబడతాడా లేదంటే చివరి నిముషంలో మహేష్ లానే హ్యాండ్ ఇచ్చి నిలబడతాడా లేకుంటే మహేష్ లానే చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడా అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: