నీది నాది ఒకే కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న వేణు ఊడుగుల రెండవ చిత్రాన్ని రానాతో తెరకెక్కిస్తున్నాడు. విరాటపర్వం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం.. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్లే. విరాటపర్వం ఒక పీరియాడిక్ డ్రామా. 1990 ప్రాంతంలో తెలంగాణలో నక్సలిజం బాగా ఉండేది. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIRATA PARVAM 1992' target='_blank' title='virata parvam-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>virata parvam</a> has five strong ...

 

ఆ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపిస్తుండగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. అయితే రానా, సాయిపల్లవి, ప్రియమణి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఔట్ ఫుట్ విషయంలో నిర్మాత సురేష్ బాబు చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యాడట. దాంతో తనకి తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని పంచుకుంటున్నాడట.

 

 

 

అయితే ప్రస్తుతం వేణు ఊడుగుల చేతికి రెండు సినిమాలు వచ్చాయని టాక్. లాక్డౌన్ టైమ్ లో వేణు ఒక కథ రాసుకున్నాడట. 1995 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ కథని నిర్మించడానికి 14 రీల్స్ ముందుకు వచ్చిందని, అందులో స్టార్ హీరో నటించనున్నాడని తెలుస్తుంది. ఇక పోతే ఓటీటీకి బాగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆహా కోసం వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడట.

 

 

 

ఇప్పటికే అల్లు అరవింద్ సంప్రదించాడని, చలం రాసిన కథని వెబ్ సిరీస్ గా రూపొందించనున్నాడని అంటున్నారు. మొత్తానికి వేణుకి మంచి ఆఫర్సే ఉన్నాయి. దీంతో విరాటపర్వం సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: