టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చి టాప్ యంగ్ హీరోలు అందరితోను నటించి సినిమాకు కోటిన్నర పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన రకుల్ ప్రస్తుత పరిస్థితులలో తన పారితోషికాన్ని సగం పైగా తగ్గించుకున్నా ఆమెను ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికితోడు కరోనా సమస్యలతో షూటింగ్ లు కూడ ఆగిపోవడంతో కనీసం ఈమెకు కథలు వినిపించే దర్శకులు కూడ కరువైపోయారు.


తాను ఢిల్లీ అమ్మాయిని అయినా హైదరాబాద్ లోనే సెటిల్ అవుతాను అని ఆమె ఓపెన్ గా చెపుతున్నా ప్రస్తుతం ఆమెను టాలీవుడ్ కు చెందిన ఏటాప్ హీరో ఏటాప్ దర్శకుడు పట్టించుకాకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఇలాంటి పరిస్థితులలో నైరాశ్యంలో ఉన్న రకుల్ ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.


ప్రస్తుతం కరోనా సమస్యల వల్ల షూటింగ్ లు లేకపోవడంతో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి వరసపెట్టి సినిమాలు వెబ్ సిరీస్ చూస్తూ మధ్యలో ధ్యానం చేసేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న విషయాన్ని తెలియచేసింది. అయితే తాను ప్రస్తుతం ధ్యానం చేస్తున్నా తన నిర్వాహణలో ఉన్న మూడు జిమ్ ల గురించి వాటికి చెల్లించవలసిన అద్దెల గురించి సిబ్బంది జీతాలు నిర్వాహణా ఖర్చుల గురించి తన ఆలోచనలు పెరిగిపోతున్నాయని కామెంట్ చేసింది.


ప్రస్తుతం కరోనా పరిస్థితులు వల్ల ప్రపంచంలో ఎక్కడ సమస్యలు లేకుండా భయం లేకుండా జీవించగలమో అర్ధంకావడంలేదు కాబట్టి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రస్తుతం మన భూమి అవతల ఉన్న విశ్వ గ్రహాలలో ఏ గ్రహం అనుకూలమో ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది అంటూ రకుల్ చేసిన కామెంట్స్ లో అనేక అర్థాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ కు సంబంధించి క్రాష్ కోర్సులు నేర్చుకుంటూ భవిష్యత్ లో తనకు సినిమాలు తగ్గిపోయినా ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా మారి కార్పోరేట్ లెవెల్ లో రాణించాలని రకుల్ కలలు కంటూ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాయిలకు స్కిన్ కేర్ కోర్సులు చెపుతూ డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలలో మునిగిపోయింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: