భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ కూడా ఒకరు. రోబో సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన శంకర్, ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా .. అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికి రిలీజై ఉండేది. కానీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

కొద్ది రోజుల క్రితం క్రేన్ ఆక్సిడెంట్ జరిగి షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఆక్సిడెంట్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన ప్రాణాలని కోల్పోయాడు. అయితే మళ్ళీ అన్ని కుదురుకుని షూటింగ్ కి రెడీ అవుతున్న సమయంలో కరోనా వచ్చి పడింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అయితే డైరెక్టర్ శంకర్ తన తర్వాతి సినిమాగా మరో సీక్వెల్ ని రూపొందిస్తున్నాడట. ఆయన దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు ఎంత సంచలన విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. 

 

సామాన్య జర్నలిస్టు ఒక్క రోజు సిఎమ్ గా మారితే ఏ విధంగా ప్రభావం చూపుతాడన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ అందుకుని దర్శకుడు శంకర్ సత్తా ఏంటో తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట. ఒకే ఒక్కడు సీక్వెల్ కి కథ రాస్తున్నాడని సమాచారం. లాక్డౌన్ సమయంలో ఈ సీక్వెల్ పై వర్క్ చేసాడని అంటున్నారు.

 

ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ సీక్వెల్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్నాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో స్నేహితుడు అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కనుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: