దివంగత బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచార. ఇటీవల విడుదలైన ఈసినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించింది. వారం రోజుల వ్యవధిలోనే 70మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ఇండియన్ మూవీ ట్రైలర్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. నిన్నటి తో దిల్ బేచార ట్రైలర్ కోటి లైకులను రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధిక లైకులను రాబట్టిన ఏకైక ట్రైలర్ గా రికార్డు సొంతం చేసుకుంది.  
 
సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రం థియేటర్లలో కాకుండా  డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలకానుంది. డిస్నీ+హాట్ స్టార్ ఈ చిత్రాన్ని ఫ్రీగా స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. జూలై 24న ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ముఖేష్ చాబ్రా డైరెక్ట్ చేసిన ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా సంజనా సంఘీ హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇదే మొదటి సినిమా కాగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈచిత్రాన్ని నిర్మించింది. 
 
ఇక గత నెల 14వ తేదిన ముంబై లోని తన అపార్ట్మెంట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. డిఫ్రెషన్ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో వెల్లడికాగా ప్రస్తుతం ఈ కేసు పై ముంబై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా  ఇప్పటివరకు 33మందిని విచారించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు అయితే ఈకేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు నిజాలు బయటపడతాయని సుశాంత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: