కరోనా దెబ్బకు ఇప్పుడు ఏ ఒక్క హీరో కూడా షూటింగ్ కి వెళ్ళే పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలు కూడా పెద్దగా ఫలించడం లేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు కొందరు స్టార్ హీరోలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా షూటింగ్ ల విషయంలో వెనక్కు తగ్గుతూనే ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ మొదలు అయితే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్న హీరోలు... 

 

కరోనా తగ్గే వరకు లేదా హైదరాబాద్ లో కేసులు తగ్గుముఖం పట్టే వరకు కూడా షూటింగ్ కి వెళ్ళవద్దు అని భావిస్తున్నారు అని సమాచారం. చిరంజీవి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు అని సమాచారం. ఇటీవల తనతో ఒక దర్శకుడు సమావేశం కాగా ఆయన ఇదే విషయం స్పష్టంగా చెప్పి ఏ సినిమా కథలను కూడా ఆయన వినడం లేదట. అనవసరంగా రిస్క్ వద్దు అని కేసులు పెరిగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది అని చిరు అన్నారు అని టాక్. దీనితో సదరు దర్శకుడు కూడా వెనక్కు తగ్గారు అని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. మరి ఎప్పుడు చేస్తారు అసలు ఏంటీ అనేది  ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక చిరు తో సినిమాలు ఇప్పుడే వద్దు అని రాం చరణ్ చెప్పాడు అని కూడా టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: