టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు ఎప్పుడు కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ తో అయినా సరే మరొకరకంగా అయినా సరే ఆ సినిమాలను చూసే పరిస్థితి ఉంటుంది అనే చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో కమర్షియల్ కోణం లో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో ఆ విధమైన సినిమాలు చాలా వరకు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ఏంటీ అంటే ఇక నుంచి యాక్షన్ సినిమాలు వద్దు అని భావిస్తున్న స్టార్ హీరోలు ఇక నుంచి ఒక రకమైన సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. 

 

ఉదాహరణకు సంక్రాంతి సినిమా ఘర్షణ సహా ధ్రువ వంటి సినిమాలు ఉన్నాయి. మాస్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే చూసే సినిమాలు అవి. సొల్లు యాక్షన్స్ సీన్స్ లేకుండా సినిమాలు చాలా వరకు అందంగా ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు కూడా అలాంటి సినిమాలనే దాదాపుగా ప్లాన్ చేస్తున్నారు జనాలు అని సమాచారం,. ఇటీవల ఒక స్టార్ హీరో తనతో సినిమా చేసే దర్శకుడికి అదే విషయం స్పష్టంగా చెప్పారు అని సమాచారం. మాస్ క్లాస్ అందరూ చూసే విధంగా కథను ప్లాన్ చేసారట. 

 

సినిమా వచ్చే ఏడాది వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ విధంగానే సినిమాలు ఉంటే మంచిది అని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుంది అని ఓటీటీ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు అని సమాచారం. మరి ఎంత మంది స్టార్ హీరోలు ఈ తరహా సినిమాలు చేస్తారు అనేది చూడాలి. ఎన్టీఆర్ కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నాడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: