టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తుండగా నివేత థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరొక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మిగతా షూటింగ్ ని అతి త్వరలో ముంగించి, వచ్చే ఏడాది బిగినింగ్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాతో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ మూవీ లో కూడా పవన్ కళ్యణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

IHG

పవన్ ను ఎంతో అభిమానించే తమిళ నిర్మాత ఏ ఎమ్ రత్నం, తన సూర్య మూవీ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక గజదొంగ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. టాలీవుడ్ సహా పలు ఇతర భాషలకు చెందిన పలువురు అగ్ర నటులు నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని అతి త్వరలో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయమై పలు టాలీవుడ్ వర్గాల్లో కొన్నాళ్ల నుండి ఒక చర్చ నడుస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం పీరియాడికల్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదని, ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలను మినహాయిస్తే, ఆ విధంగా పీరియాడికల్ మూవీలు గా వచ్చిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన రేంజ్ విజయాలను అందుకోలేదని, అయినప్పటికీ కూడా పవన్ మాత్రం కొంత డేర్ చేసి క్రిష్ తో అటువంటి సినిమా చేయడం కొంత రిస్క్ చేయడమే అని అంటున్నారు. 

 

అయితే గతంలో బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి వంటి భారీ హిస్టారికల్ మూవీని తీసి మంచి సక్సెస్ అందుకున్న క్రిష్, తప్పకుండా ఈ సినిమాని హిట్ చేసి తీరుతారని, అలానే తమ హీరో వకీల్ సాబ్ తో పాటు, ఈ సినిమా ద్వారా కూడా మరొక విజయాన్ని అందుకోవడం ఖాయం అని పలువురు పవన్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి తొలిసారిగా క్రిష్ తో పవన్ చేస్తున్న ఈ భారీ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్దిరోజలు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: