సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది అవకాశాలు కోసం వచ్చి మోసపోతున్న సంఘటనలు ఇటీవల చాలానే బయటపడుతున్నాయి. ఇండస్ట్రీ లో కొంతమంది అవకాశాల పేరుతో యువతీ యువకులను ఏరా వేస్తూ మోసం చేస్తున్న సంఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇదే విధంగా ఈటీవీలో పాపులర్ అయినా కామెడీ షో జబర్దస్త్ కెమెరా మెన్ అని చెప్పి సినిమా అవకాశం ఇప్పిస్తానని కొంత మంది యువతీ యువకులను మోసం చేసిన సంఘటన బయటపడింది. యువకుల నుండి డబ్బులు వసూలు చేయడం యువతులపై లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగిందట. ఇండస్ట్రీలో అవకాశాలు ఇపిస్తాను అని చెప్పిన వ్యక్తి మోసం చేసిన సంఘటన బయటపడింది. పూర్తి విషయంలోకి వెళితే రావణ్ భిక్షు అనే వ్యక్తి జబర్దస్త్ కామెడీ షో కి కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నట్లు తనని తాను ఆవిష్కరించుకోవడం జరిగింది.

 

ఈ తరుణంలో తాను త్వరలో సినిమా తీయబోతున్నట్లు యువతీ యువకులను నమ్మించాడు. “ఆత్రేయపురం ప్రేమ కథ” అన్న టైటిల్ ఈ సినిమాకి ప్రకటించాడు.  అంతేకాకుండా చైతన్య అనే బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది అదేవిధంగా అమరావతి శైవక్షేత్రం లో త్వరలో ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు, ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని కుతూహలం చెందుతున్న యువతీ యువకులు తనని సంప్రదించాలని ప్రచారం చేసుకున్నాడు.

 

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రకటన చూసి రావణ్ భిక్షు అనే వ్యక్తి జబర్దస్త్ కామెడీ షో కి కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్న దగ్గరికి వెళ్ళటం జరిగింది. దీంతో తన దగరికి వచ్చిన యువతీ యువకులు దగ్గర 30 వేల రూపాయలు డబ్బులు వసూలు చేసుకొని మరికొంత మంది యువతులను లైంగిక వేధింపులకు గురి చేశాడట. దీంతో ఇటీవల అతని చేతిలో మోసపోయిన ఓ యువతి యువకులు బయటపెట్టారు. పోలీసులను ఆశ్రయించడంతో రావణ్ భిక్షు ని పట్టుకోవటానికి గాలింపు చర్యలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: