ఆర్ ఎక్స్100 తో సెన్సేషనల్ హిట్ కొట్టి టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అయితే ఈసినిమా తరువాత కార్తికేయ మరో మూడు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అందులో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. మధ్యలో విలన్ రోల్ లో కూడా ట్రై చేశాడు. అందులో భాగంగా నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించగా..సినిమా యావరేజ్ అనిపించుకున్నా అతని నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
 
ఇక ఈహీరో ట్విట్టర్ లో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటాడు. తాజాగా కార్తికేయ ఖాతాను ట్విట్టర్ వెరిఫై చేసి బ్లూ టిక్ మార్క్ ఇచ్చింది. ఈసందర్భంగా కార్తికేయ... స్పందిస్తూ నేను చిన్నపాటి సెలబ్రెటీనే అని గుర్తించినందుకు  ట్విట్టర్ కు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశాడు. 
ఇదిలావుంటే గత ఏడాది 90ఎంఎల్ తో ప్రేక్షకులముందుకు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్న కార్తికేయ... నెక్స్ట్ చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించనున్నాడు. నూతన దర్శకుడు కౌశిక్ డైరెక్ట్ చేయనున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనుండగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈచిత్రంలో కార్తికేయ ,బస్తి బాలరాజుగా కనిపించనుండగా అతనికి జోడిగా లావణ్య త్రిపాఠి నటించనుంది. మరి ఈసినిమాతోనైనా హిట్ కొట్టి  కార్తికేయ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: